This is my attempt to translate Shri HariShankar Parsai’s “Roti”.
***
ప్రజాస్వామిక రాజుగారు కూడా జహంగీరులాగా తన కోట బయట ఒక గొలుసు వేలాడదీశారు. ఎవరికైనా ఏదైనా ఫిర్య్దాదు ఉంటే ఆ గొలుసు లాగితే రాజుగారే స్వయంగా ఫిర్యాదు వింటారని దండోరా వేయించాడు.
ఒక రోజు, బక్క పల్చగా, నీరసంగా ఉన్న మనిషి స్థిరంగా నిలబడలేకుండా ఉన్న స్థితిలో వచ్చి, బలంలేని చేతులతో గొలుసును లాగాడు. ప్రజాస్వామిక రాజు వెంటనే కోట బాల్కనీలోకి వచ్చి అడిగాడు – “ఫిర్యాదుదారుడా! ఏం కావాలి?”
మొరపెట్టుకునేవాడు చెప్పాడు – “రాజా, నీ రాజ్యంలో మేమంతా ఆకలితో చస్తున్నాం. తినడానికి మెతుకు కూడా లేదు. నాకు అన్నం కావాలి. నేను చాలా రోజుల నుండి అన్నం తినలేదు. అన్నం కావాలని అడగడానికి వచ్చాను.”
రాజు సానుభూతితో ఇలా అన్నాడు – “సోదరా! నీ దీనావస్థ నా హృదయాన్ని ద్రవింపజేసింది. నీ తిండి సమస్య గురించి నేను ఈ రోజే ఒక ఉపసంఘాన్ని నియమిస్తాను. కానీ నీకో విన్నపం- “ఉపసంఘం రిపోర్టు వచ్చే లోపు నువ్వు చనిపోవద్దు.”